23-06-2025 07:20:16 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని రామ్ నగర్ గిరిజన బాలికల ఆశ్రమ గురుకుల పాఠశాలలో తెలంగాణ హరితహారంలో భాగంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్(Additional Collector Faizan Ahmed) సోమవారం మొక్కలు నాటారు. ఆయనతో పాటు విద్యార్థులు మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కళా ప్రధానోపాధ్యాయులు తుకారాం ఉపాధ్యాయులు పాల్గొన్నారు.