30-05-2025 02:21:58 AM
మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి
హైదారబాద్, మే 29 (విజయక్రాంతి): ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పై రేవంత్వి మాటలే తప్ప చేతలు లేవని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ప్రస్తుతమున్న ప్రభుత్వ పాఠశాలలను రేవంత్ మూసేసే కుట్ర చేస్తున్నారని, 2వేల ప్రభుత్వ స్కూళ్లను మూసేశారని ఆరోపించారు. గురువారం హైదరాబాద్లోని తెలంగాణభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల అంచనా వ్యయాన్ని 200 కోట్ల కు ఎందుకు పెంచారో చెప్పాలని డి మాండ్ చేశారు.
అసలు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పై ప్రభుత్వానికే స్పష్టత లేదని, కేవలం బిల్డింగ్లు కడితే సరిపోతుందా అని ప్రశ్నించారు. గురుకులాల్లో పరిస్థితులను దారుణంగా మార్చే శారని, మన ఊరు మనబడి ఈ ప్రభుత్వానికి ఎందుకు నచ్చలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.