calender_icon.png 7 June, 2025 | 11:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా సమస్యలు తలెత్తొద్దు

30-05-2025 02:19:52 AM

భూభారతి, రాజీవ్ యువ వికాసం, వానాకాలం సన్నద్ధతపై అధికారులకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దిశానిర్దేశం

రంగారెడ్డి, మే29 (విజయక్రాంతి): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. భూభారతి, రాజీవ్ యువ వికాసం, వానాకాలం సన్నద్ధతపై అధికారులు ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు.

గురువారం రంగారెడ్డి జిల్లా కలెక్టరే ట్ కార్యాలయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి ఉమ్మడి జిల్లా అధికా రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాసంపై పలువురు బ్యాంకర్లు స్కోరింగ్ పేరిట ఇబ్బందులు పెడుతున్నారన్న విషయాన్ని ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకొచ్చారని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టంపై జూన్ 3 నుంచి అన్నీ మండల కేంద్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని, ఈ కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైతే, విలువైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 17,440 ఇండ్లకు అలాట్‌మెంట్ ఇవ్వగా, అందులో 16,617 ఇండ్లకు మంజూరు ఇచ్చామని, 4,084 ఇండ్ల గ్రౌండింగ్ పూర్తయిందని చెప్పారు. వచ్చే వారంలో పదివేల ఇండ్లను ప్రారంభిస్తామని చెప్పారు. సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు కాల యాదయ్య, ఆరికెపూడి గాంధీ, కసిరెడ్డి నారాయణరెడ్డి, వీలపల్లి శంకర్, మనోహర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.