ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వమే విత్తనాలు అందించాలి
అశ్వరావుపేట మాజీ శాసన సభ్యులు తాటి వెంకటేశ్వర్లు
చండ్రుగొండ, జులై 19 (విజయక్రాంతి): ప్రస్తుతం వాతవరణంలో వచ్చిన మార్పులు, ఎల్నినొ ప్రభావం వల్ల వానలు కురవక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇటవంటి తరుణంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచిస్తుందని, అటువంటి పంటల విత్తనాలను ప్రభుత్వమే ఉచింతంగా రైతులకు తక్షణమే అందించాలని అశ్వరావుపేట మాజీ శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశాడు.
ఆదివారం చండ్రుగొండ లో ఆయన మాట్లాడుతూ సీతరామప్రాజెక్టు నీళ్లు అశ్వరావుపేట నియోజకవర్గంలోని ఐదు మండలాలకు తక్షణమే ఇవ్వాలని, గత ప్రభుత్వంలో పాత డిజైన్ ప్రకారం పంటకాలువలు తవ్వాలన్నారు. గొదావరి నీటి విషయంలో జిల్లా రైతులకు అన్యాయం చేసేలా ముగ్గురు మంత్రులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
జిల్లా రైతంగానికి ఈ ముగ్గరు మంత్రులే అన్యాయం చేస్తున్నారని విమర్సించారు. నీళ్ల విషయంలో రాజీపడేదిలేదని త్వరలో రైతులతో కలిసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించాడు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ జిల్లా నాయకురాలు వగెల పూజ, గుంపెన సోసైటి వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, సంగొండి రాఘవులు తదితరులు పాల్గొన్నారు.






