03-06-2025 12:00:00 AM
జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్
కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్ అన్నారు. సోమవారం జి ల్లాలోని సిర్పూర్(టి) మండలం టోం కిని, పారిగాం, లోనవెల్లి గ్రామాలలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా సహకార అధికా రి బిక్కు లతో కలిసి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భం గా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్ర క్రియ త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రహీమొద్దీన్, సిబ్బంది, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు, రైతులు పాల్గొన్నారు.