18-06-2025 12:08:49 AM
- ఏటా ఏజెన్సీ నుంచి సుమారు కోటి క్యూబిక్ మీటర్లు రవాణా
- భూగర్భ జలాలు అడగండి పర్యావరణానికి తీరని నష్టం
- గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇసుక సరాపరతో అగాధాలు
- బ్యాక్ వాటర్తో సీతారామ ప్రాజెక్టుకి, తాలిపేరు ప్రాజెక్ట్కు కరకట్టకు ముప్పు
- రాష్ట్రంలో ప్రధాన పట్టణాలకు వేల సంఖ్యలో టిప్పర్లు, లారీలతో తోలకాలు
- అధికలోడు వాహనాలతో రోడ్డు వ్యవస్థ శిధిలం
- భద్రాద్రి, ములుగు జిల్లాలలో నాణ్యమైన ఇసుక లభ్యం కావడమే కారణం
- అత్యంత క్షీణ దశలో పర్యావరణం
- బోరు బావులలోనీరు అందక బోరున విలపిస్తున్న ఏజెన్సీ గ్రామాల ప్రజలు
- గోదావరి వరదల సమయంలో పడవ ప్రమాదాలకు అవకాశం
చర్ల , జూన్ 16 (విజయ క్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఇసుక రవాణా అధికంగా జరా గుతున్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల , బూర్గంపాడు దుమ్ముగూడెం మండలాలు,ములుగు జిల్లా వెంకటాపురం, వాజే డు, ప్రాంతాలలో నాణ్యమైన ఇసుక లభ్యం కావడంతో నిత్యం రోడ్ల పై వేల సంఖ్యలో లారీలు క్యూ కడుతున్నాయి. ఇసుక ఎగుమ తి చేసేందుకు పట్టణ కేంద్రాలకు బారులు తీరుతున్నాయి.
ఈ క్రమంలో గోదావరి పరివాహక ప్రాంతలలో ఏటా సుమారు కోటి క్యూబిక్ మీటర్ల ఇసుక తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు సరఫరా అవుతున్న ట్లు అంచనా. గోదావరిలో ఇసుక తోడుతున్న క్రమంలో వరదల సమయంలో పెను ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉంద ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పర్యావరణానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నపరిరక్షణ చర్యలు శూన్యం. ఇసుక ప్రకృతి ప్రసాదించిన ప్రధాన వనరుగా ఉండడంతో గోదావరి పరివాహక ప్రాంతం ప్రమాద భరితమైన ఇసుక అగాధల కు నెలవుగా మారింది.
బ్యాక్ వాటర్తో సీతారామ ప్రాజెక్ట్కు తాలిపేరు ప్రాజెక్టుకు కరకట్టకు ముప్పు
గోదావరి వరదల సమయంలో తీవ్ర న ష్టం జరిగే అవకాశం ఉందనీ, ఇసుక అధిక త్ర వ్వకాలతో అగాధాలు ఏర్పడి గోదావరి వరదల సమయంలో బ్యాక్ వాటర్ వలన నీటి ప్రవాహ వేగం అధికంగా ఉండే అవకాశం ఉంది. దీంతో నూతనంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టుకు, జిల్లాలో పెద్ద ప్రాజెక్టుగా పేరుపొందిన తాలి పేరు మధ్యథార ప్రా జెక్టుకు , గోదావరి వరదలు నియంత్రించేందుకు నిర్మిస్తున్న కరకట్టకు పెను ప్రమా దం పొంచి ఉందనీ తెలుస్తోంది. ప్రాజెక్టుల సామర్థ్యం కి మించి వరద ప్రవాహం ఉండటంతో తాలిపేరు ప్రాజెక్టు గేట్లకు , కరకట్టకు గండి పడే ప్రమాదం పొంచి ఉంది. తద్వారా వరద తో కొన్ని వేల ఎకరాలకు పంటలకు, ఏజెన్సీలోని గ్రామాలకు వరద నష్టం ఏర్ప డే అవకాశం ఉందనీ తెలుస్తోంది.
ఇసుక ర్యాంపుల తో లక్షల సంఖ్యలలో లారీల ఆగమనం
తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ఏజె న్సీ ప్రాంతాలైన చర్ల ,వెంకటాపురం, వాజే డు మండలాలకు నిత్యం భారీ సంఖ్యలో లారీల వచ్చి, ఇసుక రవాణా యదేచ్చగా సాగుతోంది. దీంతో ఇసుక లోడింగ్ తో సు దూర ప్రాంతాలకు అధిక ప్రయాణాలు జరగడంతో రోడ్ల వ్యవస్థకు ఊహించని నష్టం ఏర్పడుతోంది. రహదారులన్నీ అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి.
ఏజెన్సీ ప్రాంతం లో గిరిజనులకు ఇసుక లారీల తో ప్రమాదాలు జరిగి మరణించిన, వికలాంగులైన వారు వందల సంఖ్యలో ఉన్నారు.ఇరుకు రహదారులలో వేగవంతమైన లారీల ప్ర యాణాలతో రహదారులు రక్తమోడిన సం దర్భాలు లేకపోలేదు. సంవత్సరం పొడుగునా ఇసుక ర్యాంపులు నిర్వహణ సాగు తుంది. ఈ ప్రాంతంలో లారీల రద్దీ పెరిగి రహదారులు శిధిలమవుతున్నాయి.
బోరుబావులలో నీరు అందక బోరున వినిపిస్తున్న ఏజెన్సీ గ్రామాల ప్రజలు
ఏజెన్సీలోని కొన్ని గ్రామాలలో బోరుబావులు వేసినప్పటికీ నీరు పడటం లేదు. వేస వికాలం ఏజెన్సీలోని మారుమూల గ్రామాలలో నీటి ఎద్దడి అధికంగా కనిపిస్తుంది. సు మారు పది గ్రామాలు తాగునీటి సమస్యతో విలువలాడు తున్నాయి. ఈ గ్రామాలు గో దావరి పరివాహక ప్రాంతానికి అతి చెరువలో ఉండడంతో బోరు బావులు వేసినప్ప టికీ నీరు అందడం లేదని తెలుస్తుంది.
సుబ్బం పేట , లెనిన్ కాలనీ, రాళ్ల గూడెం, కేశవాపురం, కొయ్యూరు, లక్ష్మీ కాలనీ, ఆర్ కొత్తగూడెం, దానవాయిపేట, తదితర పం చాయతీల పరిధిలో బోరు బావులు వేసినప్పటికీ నీరు అందక వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. ,కొన్ని గ్రామాలలో కొందరైతే నీ టి కోసం బిందెలతో రోడ్లపై కి వచ్చి ధర్నా లు చేసిన సందర్భాలు లేకపోలేదు. వీటన్నిటికీ గోదావరి పరివాహక ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తోడేస్తున్న ప్రభావమే కారణమని తెలుస్తోంది. ఏజెన్సీ గ్రామాలలో అత్యంత క్షీణ దశకు పర్యావర ణం చేరుకుందని అర్థమవుతుంది. పచ్చని సీ మల్లో పర్యావరణ కొరత తాండవిస్తోంది.
గోదావరిలో పొంచి ఉన్న ప్రమాదం
గోదావరిలో ప్రయాణికులు నదులు దా టే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. లేనిపక్షంలో పడవ ప్ర మాదాలు జరిగే ముప్పు పొంచి ఉంది. గత రెండు సంవత్సరాలుగా చర్ల మండలంలో గోదావరిలో మరణించిన వారీ సంఖ్య ఇరవై మందికి పైగానే ఉందని చెప్పవచ్చు.
లింగా పురం గ్రామానికి చెందిన ఒక వివాహితుడు గోదావరిలో లోతు తెలియక మరణించిన ఘటన, తాలి పేరు వంతెన సమీపంలో కొందరు గిరిజనులు హోలీ సందర్భంగా వెళ్లి లోతు అంచనా వేయకపోవడంతో నలుగురు యువకులు మరణిం చిన ఘటన, అలుబాక సమీపం లో చేపల వేటకు వెళ్లి గోదావరిలో మునిగి మరణించిన ఘటన, దానవాయి పేట సమీపంలో గోదావరి నదిలో కనిపించిన మృత దేహం ఇలా చె ప్పుకుంటూ పోతే చాలా ఘటనలు గోదావరి పరివాహక ప్రాంతంలో నిత్యం దర్శనమిస్తుంటాయి.
పశువులు కూడా మరణించిన సందర్భాలు లేకపోలేదు. అన్నిటికి కారణం గోదావరి పరివాహక ప్రాంతాలలో ర్యాంపుల ద్వారా తోడేస్తున్న ఇసుక, గోదావరి వరదల సమయంలో ఇతర ప్రాంతాల నుంచి కొట్టుకొని వచ్చిన ఇసుక మేటలు గా ఏర్పడి లోతు తెలియక ప్రజల ,పశువుల ప్రా ణాల మీదకు తీసుకొస్తున్నాయి.ఇప్పటికైనా మైనింగ్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు ఇసుక రాంపుల్లో ప్రభుత్వ నిబంధ నలను కచ్చితంగా పాటించేలా చర్యలు చేపట్టాలని చర్ల, దమ్ముగూడెం, బూర్గంపాడు మండలాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.