calender_icon.png 18 June, 2025 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి

18-06-2025 12:10:44 AM

 జిల్లా కలెక్టర్ జితేష్ వీ పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం జూన్ 17 (విజయక్రాంతి); గోదావరి వరదలు వల్ల ప్రజలకు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లుతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయం లో గోదావరి వరదలపై జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, భద్రాచలం ఏఎస్పీ వి క్రాంత్ సింగ్ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రతి అధికారి వాహనంలో లైఫ్ జాకెట్లు,టార్చి లైటు, తాడు, హ్యాండ్ మై కు, అందుబాటులో ఉండాలన్నారు. ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా ముందస్తు ప్లడ్ మేనేజ్మెంట్ ప్రణాళిక తయారు చేయాలన్నారు. వరద ముంపుకు గురయ్యే గ్రామా ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ముంపుకు గురయ్యే వరకు వేచి ఉండకుండా ముందు గానే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా సన్నద్ధంగా ఉండాలన్నారు.

వరదల నుండి ప్రజలను కాపాడేందుకు గ్రామస్థాయి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సన్నాహక సమావేశంలో దిశానిర్దేశం చేసిన అంశాల పట్ల అన్ని శాఖల అధికారులు సమ గ్ర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. వరదల్లో చిక్కుకున్న వ్యక్తులను రక్షించేందుకు లైఫ్ జాకెట్లు, గజ ఈతగాళ్లు, నాటుపడవలు, బోట్లు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. రానున్న మూడు నెలల వరకు అనగా అక్టోబర్ మాసం వరకు సరిపోను అన్ని రకాల నిత్యావసర వస్తువులు స్టాకు ఉంచాలని జిల్లా పౌర సరఫరాల అధికారిని ఆదేశించారు.

వరద ముంపు చర్యలు పర్యవేక్షణకు సెక్టోరియల్, జోనల్ అధికారులను ని యమించనున్నట్లు చెప్పారు. వరద యొక్క సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు ముంపు గ్రామాల ప్రజల ఫోన్ నెంబర్లును అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. విద్యుత్ అంతరాయం లేకుండా పంచాయతీరాజ్, విద్యుత్తు శాఖ అధికారులు ముంద స్తుగానే ముంపు గ్రామాల్లో పరిశీలన చేయాలని చెప్పారు. ముంపుకు గురయ్యే అవకా శాలున్న ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టి విద్యుత్తు అంతరాయం లేకుండా చూడాలన్నారు.అత్యవసర సేవలకు హెలికాప్టర్ సేవ లు వినియోగించుకోవడానికి అనుగుణంగా హెలిప్యాడ్లు ఏర్పాటు చేయాలని రహదారులు భవనాల శాఖ అధికారులకు సూచిం చారు.

అత్యవసర సేవలు కొరకు మొబైల్ సెట్లు వినియోగించేందుకు సెట్లు అందుబాటులో ఉంచాలని  చెప్పారు. గోదావరికి పై నుండి వచ్చే వరద సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజలను అప్రమ త్తం చేస్తుండాలన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు విషయంలో ప్రాధాన్యతలను తెలియచేయడంతో పాటు ఇబ్బందులు రాకుండా ముం దస్తుగానే ఆయా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కిన్నెరసాని వంటి ప్రాజెక్టులు గేట్లు ఎత్తు సమయంలో ప్రభావిత ప్రాంతాలకు ముందస్తుగా తెలియజేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.పునరావాస కేంద్రాల్లో ఆహారా న్ని తయారు చేసేందుకు వంట చేసే సిబ్బందిని సిద్ధంగా ఉంచాలన్నారు.

భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలు పనిచేయు చేయు విధంగా ఫ్లడ్ కంట్రోల్ రూము ఏర్పాటుతో పాటు మండల, జిల్లాస్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చే యాలన్నారు. వరదల సమయంలో గర్భిణి మహిళలు ఇబ్బందులు. పడకుండా ముంద స్తు జాబితాను సిద్ధం చేసి సమీపంలోని ఆసుపత్రుల్లో చేర్పించు విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ఈడీ క్యాలెండర్ తప్పనిస రిగా ఉండాలని ఆదేశించారు.  సింగరేణి, కేటిపిఎస్, ఐటిసి, నవభారత్ తదితర సంస్థ ల రెస్క్యూ టీముల సేవలు వినియోగించుకునేందుకు జాబితా అందుబాటులో ఉంచా లని చెప్పారు. వర్షాకాలంలో పశువులు వ్యాధులకు గురికాకుండా టీకాలు వేయు కార్యక్రమాలను చేపట్టాలని పశుసంర్దక అధికారులను ఆదేశించారు.

వరదల సమయం లో పశువులు ప్రమాదాలకు గురి కాకుండా వాటిని పెద్ద తాడుతో కట్టివేసించాలని దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గుత్తికోయ ఆవాసాల్లో పర్యటించి ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పా రు. లయింగ్ ఏరియాల్లో నీటి నిల్వలు లేకుండా డ్రెయిన్లు పరిశు భ్ర పరచడం, డ్రైయిన్లు నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పారు. విస్తా కాంప్లెక్సు, అశోక్ నగర్ నీటి నిల్వలు లేకుండా ఎత్తిపోసేందుకు మోటార్లును అందుబాటులో ఉంచాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ అధికారులు తమ పరిధిలోని లోవర్ బ్రిడ్జిలను గుర్తించి ప్రణాళికలు అందించాలని ఆదేశించారు. అన్ని లో లెవెల్ బ్రిడ్జిలు వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఆగ స్టు 15 లోపు తూర్పాక హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తిచేయాలని ఆర్ అం డ్ బి అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పరిధిలోని మంజూరు అయిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదే శించారు.

వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నీటిపారుదల శాఖ అధికారులు కెనాల్, ప్రాజెక్టుల వద్ద సుబాబులు మరి యు సిస్సు మొక్కలను విస్తృతంగా నాటాలన్నారు. అధికారులందరూ కార్య స్థానం విడి చి వెళ్లరాదని క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.విధి నిర్వహణలో అలసత్వం వలన ఏ ఒక్క ప్రాణ నష్టం జరిగినా సంబంధిత అధికారుల పైన కఠిన చర్యలు ఉంటాయని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో రాహుల్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, భద్రాచలం ఆర్డీవో దా మోదర్ రావు, అన్ని శాఖల అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.