calender_icon.png 22 December, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా కరీంనగర్ ‘కిసాన్ గ్రామీణ మేళా’

22-12-2025 12:19:29 AM

ప్రారంభకులుగా హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, పి. సుగుణాకర్ రావు వెల్లడి

కరీంనగర్, డిసెంబర్21(విజయక్రాంతి): రైతులు, మహిళా సంఘాలు , గ్రామీణ ప్రజ ల ఆర్థిక ప్రగతిని కాంక్షిస్తూ, ’కిసాన్ జాగరణ్’ ఆధ్వర్యంలో కరీంనగర్ వేదికగా మరో సారి భారీ ఎత్తున *కిసాన్ గ్రామీణ మేళా ను నిర్వహిస్తున్నట్లు కిసాన్ జాగరణ్ అధ్యక్షులు పి. సుగుణాకర్ రావు తెలిపారు. ఆది వారం కరింనగర్ లో విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ ఈ బృహత్తర కార్యక్రమా న్ని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభి స్తారని ఆయన వెల్లడించారు.

గత 2022, 2023 సంవత్సరాల్లో నిర్వహించిన ప్రదర్శనలకు తెలంగాణలోనే అత్యధిక సంఖ్యలో రై తులు హాజరైన రికార్డు ఉందని, ఈసారి అం తకు మించి వినూత్న కార్యక్రమాలతో మేళా ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. హై దరాబాద్లోని హైటెక్స్ లేదా ఎగ్జిబిషన్ గ్రౌం డ్స్లో జరిగే ప్రదర్శనలకు దూరప్రాంత రైతు లు వెళ్లలేకపోతున్నారని, అందుకే రైతు చెంతకే సాంకేతికతను తీసుకురావాలనే ఉద్దేశంతో కరీంనగర్ను వేదికగా ఎంచుకున్నట్లు తెలిపారు.

లాభదాయక ప్రత్యామ్నాయ పంటలు: కేవలం వరి సాగుకే పరిమితం కా కుండా.. పామాయిల్, పాడి పరిశ్రమ, గొ ర్రెల పెంపకం వంటి మార్గాల ద్వారా ఎకరాకు కనీసం లక్ష రూపాయల ఆదాయం ఎలా పొందాలనే అంశంపై రైతులకు దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. నీరు నిలిచే పొలాల్లో మత్స్య సాగు: ఎస్.ఆర్.ఎస్.పి కెనా ల్ పరివాహక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి వరి పంట దెబ్బతింటున్న పొలాల్లో.. చేపలు మరియు రొయ్యల పెంపకం ద్వారా అధిక లాభాలు గడించే విధానాలను వివరిస్తారన్నారు.

ఎఫ్పిఓ ల బలోపేతం: చింతకుంట ఎఫ్పిఓ (శంకరయ్య ఆధ్వర్యంలో రూ. 2 కో ట్ల టర్నోవర్), కోనరావుపేట ఎఫ్పిఓ (పురుషోత్తం రావు తేనెటీగల ప్రాజెక్ట్), బోయినప ల్లి ఎఫ్పిఓ సాధిస్తున్న విజయాలను ఆదర్శంగా తీసుకుని ఇతర రైతులను చైతన్యపర చనున్నామని తెలిపారు.

యూరియా బుకిం గ్ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త యాప్ వినియోగం, తక్కువ శ్రమతో ఎక్కువ లా భాలు తెచ్చే తేనెటీగల పెంపకం, గీత కార్మికుల కోసం చెట్లు ఎక్కే ఆధునిక పరికరాలపై అవగాహన కల్పిస్తామన్నారు.ఈ మేళాలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అనుభవజ్ఞులైన ప్ర గతిశీల రైతులు పాల్గొని తమ అనుభవాలను పంచుకోనున్నారని తెలిపారు. రైతులు, మహిళా సంఘాల సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.