16 March, 2026 | 9:44 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

సీతంపేటకు కదిలిన యంత్రాంగం

29-07-2025 12:45 AM
  1. హుటాహుటిన మూరికి కాలువ పూడిక తీసిన అధికారులు

వీధిలైట్ల ఏర్పాటు హర్షం వ్యక్తం చేసిన ప్రజలు

ముత్తారం జులై 28 (విజయ క్రాంతి) మండలంలోని సీతంపేట గ్రామంలో కంపు కొడుతున్న సీతంపేట అనేవార్త (విజయ కాంతి) పత్రికలో ప్రచురితం కాగా వెంటనే స్పందించిన యంత్రాం గం సోమవారం సీతంపేట గ్రామానికి చేరుకొని  హుటాహుటిన గ్రామంలో ఉన్న మూరికి కా లువను పూడిక తీశారు. అలాగే వీధిలైట్ల ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో మురికి కాలువలు పూడిక తీయకపోవడంతో గత నాలుగు రోజుల కురిసిన వర్షానికి నీరు చేరుకొని కంపుకొట్టడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రా మంలోని సమస్యలు తెలుసుకుని వార్త ప్రచురించగా, వార్తకు స్పందించిన ఎంపీడీవో సురేష్ ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి మనోజ్ జెసిబి తో పుడికతీత పనులు చేపట్టారు. గ్రా మంలో పారిశుద్ధ్యం పేరుకుపోకుండా గ్రామములో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. గ్రామంలోని సమస్యలు ప్రచురించిన విజయక్రాంతి పత్రిక కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.