16 March, 2026 | 10:40 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి

16-03-2026 08:36 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): హిందువులను కించపరిచే విధంగా అనుచిత వాక్యాలు చేశారని ఆరోపిస్తూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు వ్యాఖ్యలను ఖండిస్తూ  బీజేపీ, బీజేవైఎం నాయకులు ఆందోళనకు దిగారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ లోని ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన బీజేవైఎం నాయకులు కోడిగుడ్లు, టమాటాలతో సామెల్ ఇంటిపై దాడి చేశారు.

ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ..  తుంగతుర్తి నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో మా ఆలయాల వద్దకు వచ్చి నన్ను గెలిపించాలని దండాలు పెట్టి హిందువుల ఓట్లతో  ఎమ్మెల్యేగా గెలిచిన సామెల్  హిందువులను కించపరిచే విధంగా మాట్లాడటం సమంజసం కాదన్నారు.. ఎమ్మెల్యే వెంటనే బేషరతుగా హిందువులకు  క్షమాపణ చెప్పాలని, లేకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మేడిపల్లి పోలీసులు బీజేపీ, బీజేవైఎం నాయకులను అడ్డగించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.