సింగరేణి ప్రధాన ఆసుపత్రి వైద్యసేవలు అమోఘం
- బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కే .సీతా దయాకర్ రెడ్డి
పీడియాట్రిక్ , మెటర్నిటీ సేవలపై హర్షం
కొత్తగూడెం, ఏప్రిల్ 8 (విజయక్రాంతి ): తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీమతి కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి , కమిషన్ సభ్యులు సింగరేణి ప్రధాన ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని పీడియాట్రిక్ (చిన్నారుల) , మెటర్నిటీ (ప్రసూతి) వార్డులను కమిషన్ బృందం క్షుణ్ణంగా తనిఖీ చేసింది. అక్కడి వైద్య ప్రమాణాలు, మెరుగైన వసతులు ,ఆసుపత్రి నిర్వహణ తీరు పట్ల చైర్మన్ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులకు సమానంగా వైద్య పరికరాలు అందుబాటులో ఉండటాన్ని కమిషన్ అభినందించింది.
పీడియాట్రిక్ వార్డులో చిన్నారులకు అందుతున్న ప్రత్యేక చికిత్సలను, నియోనేటల్ కేర్ యూనిట్ను పరిశీలించిన చైర్మన్ వైద్యులు , సిబ్బందిపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రసూతి వార్డులోని బాలింతలతో చైర్మన్ , సభ్యులు ముఖాముఖి మాట్లాడారు. డాక్టర్ల పర్యవేక్షణ, ఉచిత మందుల పంపిణీ , ఆసుపత్రి సిబ్బం ది అందిస్తున్న సేవలు చాలా బాగున్నాయని రోగులు కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ కార్యక్రమంలో కమిషన్ చైర్మన్ ,కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి తో ,పాటు కమిషన్ సభ్యులు, ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీ యం ఓ) , కిరణ్ రాజ్ కుమార్, ఏసీఎంఓ, ఉష ,డిప్యూటీ పర్సనల్ మేనేజర్ అవినాష్, సైకియాట్రిస్ట్ విశ్వమేది , పెడియాట్రిసియన్ , అజయ్ భోంస్లే, హెల్త్ ఆఫీసర్ లలిత , ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.




