28-01-2026 12:00:00 AM
పటాన్చెరు, జనవరి 27 :ఆపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. జిన్నారం మున్సిపల్ పరిధిలోని వావిలాల గ్రామానికి చెందిన అరేళ్ల శంకర్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
మెరుగైన వైద్య చికిత్స కోసం ఎమ్మెల్యే జిఎంఆర్ ద్వారా ఎల్ఓసి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన లక్ష రూపాయల ఎల్ఓసిని మంగళవారం పటాన్చెరు లోని తన కార్యాలయంలో శంకర్ కుటుంబ సభ్యులకు అందజేశారు.