15 April, 2026 | 12:09 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

తాగునీటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

28-01-2026 12:00 AM

తాడ్వాయి, జనవరి, 27( విజయ క్రాంతి ): రాబోయే వేసవి కాలంలో తాగునీటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తాడ్వాయి ఎంపీ ఓ సవిత రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్పంచ్ లకు, కార్యదర్శులకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రానున్న వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, పైపులైన్ల లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. బోరు బావుల సమస్యలు ఉంటే బోరు బావులు బాగు చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు