12-12-2025 12:17:42 AM
మహబూబ్ నగర్ టౌన్, డిసెంబర్ 11: నీటి ఎద్దడి ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయిన వెంటనే స్పందించి 22వ వార్డులో నూతనంగా బోరు వేయించి నీటి సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే చర్యలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని 22వ వార్డు కాలనీవాసులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సత్తూరు చంద్రకుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.