06-06-2025 12:00:00 AM
అదిలాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఓ నూత న జంట మొక్కను నాటి ఆదర్శంగా నిలిచారు. గురువారం ఆదిలాబాద్లోని ఓ గార్డెన్లో జన విజ్ఞాన వేదిక జిల్లా శాస్త్ర ప్రచార కన్వీనర్ వేముల నాగరాజు-దీప వివా హం సందర్భంగా జనవిజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతన వధూవరుల చేత పెళ్లికి గుర్తుగా గార్డెన్లోనే ఒక మొక్కను నాటించి పెళ్లి మండపంలో పర్యావరణ ఆవశ్యకతను అందరికీ తెలియజేశారు.
భవిష్యత్తు తరాలకు కాలుష్యం లేని పర్యావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని నూతన వధువరులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి నూతుల రవీందర్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉమాకాంత్, ఉషన్న జిల్లా కమిటీ సభ్యులు శ్రీధర్ బాబు, సంతోష్ కుమార్ వీరన్న, గంగన్న, శ్రీనివాస్, లింగన్న ఆత్రం సంతోష్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపే ష్ రెడ్డి పాల్గొన్నారు.--