27-05-2025 10:47:17 PM
కోదాడ: ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవాలు అని మాజీ వార్డు కౌన్సిలర్ సామినేని నరేష్(Former ward councilor Samineni Naresh), కనగాల కొండయ్యలు అన్నారు. మంగళవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 1983లో 446/ఆ సర్వే నెంబర్ లో కనగాల నరసింహయ్యకు చెందిన నాలుగెకరాల 30 కుంటలు భూమినీ ఇందిరమ్మ కాలనీకి అధికారులు భూసేకరణ చేశారు.
అలాగే కనకాల వెంకటేశ్వరరావు నాలుగు ఎకరాల 30 కుంటలు భూమి ఉండగా అందులో మూడు ఎకరాల ఆరు కుంటలు భూమిలో కాలనీవాసులు ఏడు ఎకరాల 36 కుంటల్లో ఇండ్లు నిర్మించుకున్నారు. మిగిలిన ఎకరం 24 కుంటలు ధరణి, భూ భారతిలో కనగాల వెంకటేశ్వర్లు పేరుతో వస్తుంది. ఆ భూమిని కొంతమంది కబ్జా చేసేందుకు చూస్తున్నారు. మా భూమి నీ మేము బాగు చేసుకుంటున్న ఆపడం ఏంటినీ ప్రశ్నించారు. మాపై వస్తున్న వార్తలు అవాస్తవం అని ఖండించారు. దీనినీ తప్పని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని అన్నారు. అంతేకాకుండా భూమిని కూడా వదిలేస్తామని తెలిపారు.