6 July, 2026 | 2:08 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

ప్రసవాల సంఖ్య పెంచాలి

20-03-2025 02:11 AM

నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నాగార్జున సాగర్, మార్చి 19 :  ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  ప్రసవాల సంఖ్య పెంచాలని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. త్రిపురారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆమె తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది హాజరు, ఓపీ, స్టేరిలైజేషన్ రిజిస్టర్లను పరిశీలించి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఓపీని పెంచాలని, ప్రతి రోగి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పారు.

గర్భిణులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలని, మాతాశిశు మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్సీ భవనం శిథిలావస్థలో ఉందని, మరమ్మతులు లేదా  కొత్త భవనం నిర్మించాలని వైద్యాధికారి కోరగా సానుకూలంగా స్పందించారు.

అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ కార్డుల దరఖాస్తుల అప్లోడింగ్ పరిశీలించారు. అంతకుముందు స్థానిక కేజీబీవీకి వెళ్లి వంటగది, స్టోర్రూమ్, సరుకులు, కిచెన్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులను సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలడిగి అభ్యసన సామర్థ్యాలు పరిశీలించారు.