27-05-2025 12:23:01 AM
పండగ సాయన్న విగ్రహవిష్కరణలో శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్
సిద్దిపేట, మే 26 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ద్వారానే ముదిరాజ్ కులస్తుల సంఖ్య తేలిందని శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ తెలిపారు. సోమవారం నంగునూర్ మండలం పాలమాకుల గ్రామంలో పండగ సాయన్న, కొరివి కృష్ణ స్వామి విగ్రహాలను మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తో కలిసి శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ ప్రారంభించి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రముఖుల విగ్రహాలను పెట్టుకునీ గుర్తించుకుంటున్నాం, మన ప్రముఖుల చరిత్రలు బయటకు వస్తున్నాయన్నారు. కృష్ణ స్వామి విగ్రహాలను హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్రంలో నలుమూలల ఏర్పాటు చేసి ఆయన చరిత్ర సమాజానికి పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో(1956) మొదటి మేయర్ గా కృష్ణ స్వామి చరిత్రలో నిలిచారని తెలిపారు.
పండగ సాయన్న భూస్వాములకి వ్యతిరేకంగా పోరాటం చేశాడనీ, పెద్దొన్ని కొట్టు పేదలకు పెట్టాలనే నినాదంతో ఆయన పని చేశారని వివరించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కేవల్ కిషన్ జాతరను అధికారికంగా ప్రకటించీ నిధులు విడుదల చేశారాని గుర్తు చేశారు.
స్వాతంత్రం వచ్చి 70ఏండ్లు గడిచిన పేద ముదిరాజ్ లకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. కేసీఆర్ చేయించిన సమగ్ర కుటుంబ సర్వే వల్ల మన ముదిరాజ్ కుటుంబాలు అధిక సంఖ్యలో ఉన్నామని తెలిసిందన్నారు. కేసీఆర్ హయాంలోనే మత్సకారులకు వాహనాలు పంపిణీ చేసి అభివృద్ధికి వచ్చేసారు అని చెప్పారు.