05-06-2025 12:28:07 AM
- ఎన్ని ఆరోపణలు ఉన్నా ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు శూన్యం
- అనుమతి లేకుండానే అడ్డగోలు ఫీజులు వసూలు
- అవినీతి అధికారుల తీరుపై విమర్శల వాన
మహబూబ్ నగర్ జూన్ 4 (విజయ క్రాంతి) : పాలమూరు విద్యాశాఖ తీరే వేరు గా ఉంది. అనుమతులు ఉన్నా...లేకు న్నా.. ఒక పాఠశాలలో విద్యాబోధన చేస్తూ మరో పాఠశాలలో పేర్లు నమోదు చేస్తున్నా... వి ద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న కొన్ని ప్రైవేట్ పాఠశాల పై చర్యలు తీసుకోవడమే విద్యాశాఖ అధికారులు మర్చిపోయిన ట్లున్నారని ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఉన్నత అధికారుల ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆమె ఆశించిన మేరకు చర్యలు తీసుకోవడం లేదని పలు విద్యార్థి సంఘాల నాయకులు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. అన్ని తెలిసినప్పటికీ కూడా నివారణ చర్యలు మాత్రం విద్యాశాఖ అధికారులు తీసుకోవ డం లేదని పలువురు ఆరోపిస్తుండ్రు. ఇకనైనా విద్య శాఖ స్పందిస్తుందా లేదా చూడాలి..
గుర్తింపు లేని పాఠశాలలను తొలగిస్తే తప్పేంటి..?
సక్రమమైన విద్యా బోధనలు చేస్తూ భావితరాల భవిష్యత్తు ను తీర్చిదిద్దే విద్యార్థులకు గురువులుగా ఉంటూ మంచి నడవడికనే నేర్పించే విద్యా కేంద్రాలే అనుమతులు లే కుండా అక్రమమైన మార్గాల్లో ముందుకు సాగడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాల నిర్మాణాన్ని సక్రమంగా లేకుంటే.. విద్యార్థుల భోజనం మరి ఏ విధంగా ఉంటుం దో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.
గ్రాడ్యుయేషన్ అసోసియేషన్ ఆరోపణలు ఇలా..
ఏం ఈ ఓ లు లంచలకు అలవాటు పడి స్కూల్ పెర్మిషన్, రెన్యూవల్, అప్గ్రేడ్ పైల్స్ పై సిగ్నేచర్, స్టాంప్ వెయ్యడానికే పరిమితమాయ్యరా అంటూ గ్రాడ్యుయేషన్ అసో సియేషన్ నేతలు పలు ప్రశ్నలను వేస్తుండ్రు. ఏం ఈ ఓ లు స్కూల్ పరిమిషన్ ఇవ్వాలం టే ఫీల్ విజిట్ చెయ్యాలని తెలియ దా...? విపరీతమైన అక్రమాలు అవినీతి వాస్తవమైన ఆరోపణలు వచ్చిన సిబ్బంది పై ఎం క్వరీ చెయ్యరని ఆ సెక్షన్ నుండి తోలగించట్లేదు ఎందుకోసమని,ఇలా చేస్తే వారు ఎ లా మారుతారు....? విద్యాశాఖ అధికారి స్పందించాలని వారు కోరుతుండ్రు. కొన్ని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు నిబంధనలు అస్సలు పట్టించుకోకుండా అధికారుల ను మెయింటైన్ చేస్తూ ముందుకు సాగితే ఎలా అని గ్రాడ్యుయేషన్ అస్సోసియాషన్ జిల్లా అధ్యక్షులు శోభన్ బాబు, నాయకులు రవి, నరేష్, శబాజ్, కృష్ణ ప్రశ్నించారు. ఇకనైనా అధికారుల స్పందించాలని వారు కోరుతుండ్రు.
అనుమతులు ఉండాల్సిందే...
కొత్తగా ఒక పాఠశాలను ప్రారంభించాలంటే తనిఖీ ఫీజు, డిపాజిట్ తదితరాలకు బ డి ప్రాంగణం విస్తీర్ణాన్ని బట్టి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వివిధ ప్రభుత్వ శాఖలకు ఫీజు చెల్లించాలి. అగ్ని మాపక శాఖ ఎన్ఓసి, ట్రాఫిక్ పోలీసుల క్లియరెన్స్, శానిటరీ సర్టిఫికెట్, పాఠశాల భవనం పటిష్టత ధ్రువ పత్రాలు పొందాలి. ఒకసారి అనుమతి పొం దితే. ఓపెన్ పర్మిషన్ 1 ఇయర్ తర్వాత రేనివల్ పర్మిషన్ . పదేళ్ల వరకూ గడువు ఉం టుంది. గుర్తింపు లేని బడులకు విద్యా హక్కు చట్టం ప్రకారం రూ.లక్ష జరిమానా విధించే హక్కు విద్యాశాఖ అధికారులకు ఉం టుంది. నీ మీదకు చర్యలు ఎక్కడ కనిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి.
అధికారుల ఆదాయమే ముఖ్యమా... సర్కార్ కు ఆదాయం అక్కర్లేదా..?
అనుమతులు తీసుకోని కారణంగా సర్కారు ఆదాయానికి రూ.కోట్లలో గండిపపడడంతో పాటు విద్యార్థులకు సైతం నష్టం వాటిల్లుతోంది. ఆయా పాఠశాలలు ఇచ్చే టీసీలు చెల్లవు. ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థులు పదో తరగతికి వస్తే పరీక్ష ఫీజు చెల్లించడమూ సాధ్యం కాదు. జిల్లాలో కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు అనుమతులు లేకుండానే అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. కొన్ని పాఠశాలల అనుమతి గడువు ముగిసినా.. తిరిగి రెన్యువల్ చేసుకోవడం లేదు.
కార్పొరేట్ స్కూళ్లు ఒకచోట అనుమతి తీసుకొని మరో చోట బ్రాంచీలను ఏర్పాటు చేస్తున్నాయి. నిర్మాణంలో ఉన్న స్కూల్ బిల్డింగులో తాత్కాలిక కార్యాలయాలు తెరిచి పేరెంట్స్ వద్ద రూ.లక్షలు వసూలు చేస్తున్నాయి. కొన్ని స్కూళ్లు ఒకటి నుంచి ఏడో తరగతి వరకే అనుమతులు తీసుకుని 8, 9, 10వ తరగతి గదులతో నడిపిస్తున్నాయి. మరికొన్ని స్కూళ్లు సాధారణ స్కూల్ అని అనుమతులు తీసుకుని ఇంటర్నేషనల్, టెక్నో, కాన్సెప్ట్ అని రకరకాల ట్యాగులు తగిలిచ్చి పేరేంట్స్ వద్ద దోపిడీకి పాల్పడుతున్నా విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదు.
పర్యవేక్షణ చేస్తాం ..
ప్రతి పాఠశాలలపై ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. నిబంధనలు పా టించండి పాఠశాలలపై చర్యలు తీసుకుం టాం. అధికారులు పారదర్శకంగా పనిచేయ డం జరుగుతుంది. ఎక్కడ అక్రమాలకు తావు లేకుండా ముందుకు సాగుతున్నాం.
ప్రవీణ్ కుమార్, డీఈవో, మహబూబ్నగర్