05-06-2025 12:28:24 AM
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో తాళాలు వేసి.. పర్యవేక్షణ మరిచారు
నిర్వహణ లేక లక్షల ప్రజాధనం వృథా
కనీస అవసరాల కోసం ప్రజల తిప్పలు...
ఇబ్రహీంపట్నం, జూన్ 4:ప్రజా అవసరాల కోసం ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలె ట్లకు తాళాలు పడ్డాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన చౌరస్తాలో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ మున్సిపల్ అధికారుల నిర్వహణ లోపం కారణంగా నిరుపయోగంగా మారాయి.
దీంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కేంద్రానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కనీస అవసరాల కోసం ఉపయోగించుకునే టాయిలెట్స్ అందుబాటు లేకపోవడంతో వారంతా తిప్పలు పడాల్సిన దుస్థితి ఏర్పడిం ది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో స్వచ్ఛ సర్వేక్షన్ పథకంలో భాగంగా మొత్తం 6 టాయిటెల్స్ మంజూరు అయ్యాయి. వాటిని ము న్సిపాలిటీలోని ప్రధాన చౌరస్తాలో ప్రజల అవసరాల నిమిత్తం ఏర్పాటు చేశా రు.
అయితే అందులో మూడు టాయిలెట్స్ నిర్వాణ ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించగా, మిగిలిన మరో మూడు టాయిలెట్స్ను ము న్సిపల్ అధికారులు వినియోగంలోకి తీసుకురావడంలో అధికారుల విఫలమవుతున్నా రన్న స్థానికులు ఆరోపిస్తున్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా మున్సిపాలిటీని సుందరీకర ణంగా తీర్చిదిద్దడంతో పాటుగా బహిరంగ మల,మూత్ర విజర్జన నియంత్రించడం కో సం వీటిని ఏర్పాటు చేసినప్పటికీ మున్సిపాలిటీ అధికారుల అలసత్వం కారణంగా స్వచ్ఛ సర్వేక్షణ్ యొక్క ల క్ష్యం నెరవేరడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పథకం కింద మంజూరైన నిధులు కేటాయించి ఏర్పాటుచేసిన టాయిలెట్స్ దిష్టిబొమ్మల్లా గా వృథాగా పడి ఉన్నాయి.
స్వచ్ఛత సాధిం చే దిశగా ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్స్ పర్యవేక్షణాలోపం కారణంగా నిర్వహణ గా లికి వదిలి, వినియోగంలోకి తీసుకురాకుం డా మున్సిపల్ అధికారులు అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రజల విమర్శిస్తున్నా రు. ఫలితంగా వివిధ పనుల మీద వచ్చే ప్రజలు బహిరంగ విసర్జన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పట్టణంలోని ప్రధాన చౌరస్తాలు కంపు కొడుతున్నాయి.
సాగర్ ర హదారిపై ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్స్ పనికి రాకుండా పోతున్నాయి. మండల కేం ద్రం కావడంతో ఇతర గ్రామాలు, పట్టణాల నుంచి వచ్చే ప్రజలు తమ గమ్యస్థానాలకు, పోలీస్ స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాల పనిమీద వచ్చే మహిళలకు టాయిలెట్స్ అందు బాటులో లేక ఇబ్బందులు పడుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.
వీటి నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ప్రజాధనం వృథా అవుతుందని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణపై అధి కారులు శ్రద్ధ పెడితే పట్టణం మరింత సుందరంగా మారుతుంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
కంపు కొడుతోంది..
బహిరంగ మల, మూత్ర విసర్జన చేయకండి, మరుగుదొడ్ల ను వినియోగించండి... పట్టణంలో బహిరంగ మలమూత్ర విసర్జన చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ.... జరిమాన వేస్తామంటూ తాటికాయ అంత అక్షరాల తో ప్రచారం చేసే మున్సిపల్ అధికారులు... తాము చేసే లోపాలను గుర్తించలేకపోతున్నారని విమర్శలు సర్వత్ర వినిపిస్తున్నాయి.
ప్రజా అవసరాల నిమిత్తం పట్టణ ప్రజల నుంచి వివిధ రూపాలలో వసూలు చేసే పన్నుల పై చూపే శ్రద్ధ ప్రజలకు కనీస అవసరాలు తీర్చాలని దానిపైన పెట్టకపోవడం విడ్డూరంగా ఉంది. ఇబ్రహీంపట్నం -సాగర్ ప్రధాన రహదారి పోలీస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్స్ కు తాళాలు దర్శనమిస్తున్నాయి.
వివిధ పనుల నిమిత్తం పోలీస్ స్టేషన్ కు వచ్చేవారితోపాటు వివిధ మండలాల నుంచి నియోజకవర్గానికి వచ్చే ప్రజలు కనీస అవసరాలు తీర్చుకునేందుకు నాన్న తిప్పలు పడుతున్నారు. ముఖ్యంగా మహిళల పరిస్థితి మరి దారుణం గా ఉంది. కనీస అవసరాలను తీర్చుకోలేక వారంతా అనారోగ్యానికి గురికావాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.
మరికొందరు పబ్లిక్ టాయిలెట్స్ వద్దకు వచ్చి తాళాలు ఉండటాన్ని చూసి దాని పక్కనే బహిరంగ మూత్ర విస్తరణ చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా దుర్వాసనతో కంపు కొడుతుంది... తప్పనిసరిగా అటువైపు వెళ్లేవారు ముక్కులు మూసుకొని వెళ్లాల్సి రావడంతో మున్సిపాలిటీ అధికారుల తీరుపై వారంతా మండిపడుతున్నారు.
అందుకే తాళాలు వేస్తున్నాం..
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ లోప్రజలకు అందుబాటులో ఉన్న ఈ టాయిలెట్స్ లలో పైపు లు, నల్లాలు, వివిధ వస్తువులను దొం గలు ఎత్తుకెళ్తున్నారు. దీంతో టాయిలెట్స్కు తప్పనిసరి పరిస్థితుల్లో తాళా లు వేస్తున్నాం. వీటి నిర్వహణ బాధ్యతల కోసం ప్రైవేటు వ్యక్తులకు అవకాశం ఇస్తున్నా... ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఒకవేళ నిర్వహణ కోసం ఎవరైనా ముందుకు వస్తే వారికి మున్సిపాలిటీ నుంచి నీటి సౌకర్యం కల్పిస్తాం.
రవీంద్రసాగర్, మున్సిపల్ కమిషనర్