పదవి బాధ్యత కాదు.. ప్రజల నమ్మకం..
24-02-2026 12:00 AM
ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు
జహీరాబాద్, ఫిబ్రవరి 23 : ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు బాధ్యత కాదని ప్రజల నమ్మకం ఉన్ననాడే ఆ పదవికి వన్నె వస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు అన్నారు. మంగళవారం జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతనంగా గెలుపొందిన మున్సిపల్ కౌన్సిలర్లను ఆయన సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేయాలని తెలిపారు. వార్డులలో ఎప్పటికప్పుడు తిరుగుతూ సమస్యల పరిష్కారానికి కృషిచేసి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా గెలుపొందిన కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.




