calender_icon.png 21 June, 2025 | 4:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రజా ప్రభుత్వ పాలన

20-06-2025 12:00:00 AM

  1. రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి

రైతు భరోసా నిధులు మూడు, నాలుగు రోజుల్లో పూర్తి స్థాయిలో జమ

ఖమ్మం, జూన్ 19 ( విజయ క్రాంతి): పేదల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ప్రజా ప్రభుత్వ పాలన సాగుతోందని రాష్ట్ర రెవె న్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధా ల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.గురువారం మంత్రివర్యు లు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో క లిసి కూసుమంచి మండలంలో పర్యటించి పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నర్సింహులగూడెం గ్రామంలో నర్సింహులగూడెం నుం డి గైగోల్లపల్లి వరకు 2 కోట్ల 51 లక్షలతో ని ర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. గ్రా మంలో అంతర్గత సిసి రోడ్డు నిర్మాణ పనులకు 60 లక్షలు, ఎత్తిపోతల పథకం మరమ్మ త్తుల కోసం 60 లక్షలు మంజూరు చేశామ ని, ఇండ్లపై హై టెన్షన్ విద్యుత్ వైర్లు ఉండకుండా కార్యాచరణ ప్రారంభించామని అ న్నారు.

పుర్య తండా గ్రామంలో పుర్య తండా నుండి ఆర్ అండ్ బీ రోడ్డు వరకు 76 లక్షల రూపాయలతో నిర్మించనున్న బి.టి. రోడ్డు ని ర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకున్నామ ని అన్నారు. ఈ తండాలో 21 సిమెంట్ రో డ్లను 45 లక్షల రూపాయలతో నిర్మించుకున్నామని అన్నారు.హైత్యతండలో జెడ్పీ రో డ్డు నుంచి హైత్యతండా వయా చింతల తండా వరకు కోటి 10 లక్షలతో బీటి రోడ్డు నిర్మాణ పనులకు, పోచారం గ్రామం ఎస్సీ ప్రాంతంలో 20 లక్షలతో నిర్మించనున్న అం తర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు.

పోచారం గ్రా మంలో ఇందిరమ్మ ప్రభుత్వం 3 బీటి రోడ్లు 4 కోట్ల 89 లక్షలతో నిర్మిస్తున్నదని అన్నా రు.కూసుమంచి గ్రామం ఎస్సీ ప్రాంతంలో 38 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకున్నామని, ఇదే గ్రామంలో కోటి 20 లక్షల తో ఇప్పటికే వివిధ అంతర్గత రోడ్లను నిర్మించామని మంత్రి తెలిపారు. కూసుమంచి నుంచి అనేక గ్రామాలకు లింక్ రోడ్లు ఇవ్వ డం జరిగిందని, రావిచెట్టు తండా వరకు ఒక కోటి 65 లక్షలతో రోడ్డు నిర్మాణానికి, 50 ల క్షల రూపాయలతో షాదీ ఖానా, 7.5 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్, 9 లక్షలతో త్రాగునీటి పనులు పూర్తి చేశామని అన్నా రు.

ప్రజల దీవేనెలతో రాష్ట్రంలో సంవత్సరంన్నర క్రితం ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, గత పాలకులు అమలు చేసిన మంచి పథకాలను కొనసాగిస్తూ ఎన్నికల స మయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమాల్లో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఎస్ ఇ వెంకట్ రెడ్డి, ఆర్ అండ్ బి ఇఇ యుగంధర్, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.