28-05-2025 01:01:23 AM
హైదరాబాద్లో 5జీ అంబులెన్సులు
హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): భారతదేశంలో ప్రముఖ ఆరోగ్య సంస్థ అయిన కేర్ హాస్పిటల్స్ ‘ది పవర్ ఆఫ్ త్రీ‘ పేరుతో దేశవ్యాప్తంగా నూతన ప్రచారాన్ని ప్రారంభించింది. వేగవంతమైన స్పందన, నిపుణులతో చికిత్స, సానుభూతితో కూడిన సేవలపై దృష్టిపెట్టి, అత్యవసర వైద్య సేవల్లో దేశవ్యాప్తంగా కొత్త ప్రమాణాలను ఏర్పాటు చేయడం ఈ ప్రచార లక్ష్యం.
ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని అన్ని ఆసుపత్రుల్లో 5జీ అంబులెన్సులు ప్రారంభించింది. ఇలాంటివి హైదరాబాదులో తొలి సారిగా చూడబోతున్నాం. రోగి పరిస్థితిని అంబులెన్సులోనే ఆసుపత్రికి తెలియజేస్తారు. దీంతో డాక్టర్లు ముందుగానే సిద్ధంగా ఉంటారు. లైవ్ ట్రాకింగ్ సహాయంతో ఆసుపత్రి ఎమర్జెన్సీ డాక్టర్లు త్వరగా స్పందించి, రోగుల ప్రాణాలు కాపడేందుకు దోహదపడుతారు.
ఈ కార్యక్రమాన్ని మంగళవరం క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ ఖన్నా, గ్రూప్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ విశాల్ మహేశ్వరి, గ్రూప్ చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ శలభ్ డాంగ్, గ్రూప్ చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డా. నిఖిల్ మాథూర్, జోనల్ హెచ్ సిఓ ఓ బిజు నాయర్,
ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాధిపతి డా. కిరణ్ కుమార్, కేర్ ఇతర హాస్పిటల్ హెడ్లు, సీనియర్ నాయకత్వంతో కలిసి ప్రారంభించారు. బంజారా హిల్స్లోని కేర్ హాస్పిటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరుణ్ ఖన్నా మాట్లాడుతూ.. ఇది కేర్ హాస్పిటల్స్ భారతదేశంలో ఆరోగ్య సంరక్షణకు గర్వకారణమైన క్షణమన్నారు.