1 July, 2026 | 7:08 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

గత ప్రభుత్వం గాలికి వదిలింది

19-04-2025 01:15 AM

అభివృద్ధి చేయాల్సింది మీరే

శ్రీ రంగ నాయకులను అంగరంగ వైభవంగా మార్చాలి

రాష్ట్ర బీసీ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ విజ్ఞప్తి

పెబ్బేరు ఎప్రిల్ 18 : శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం గతపాలకులు మరిచారు, అభివృద్ధి చేయటం ఇప్పుడు ప్రభుత్వం పై ఉందని మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. కొత్త రెవెన్యూ మండలం గా ఏర్పాటు చేశారే తప్ప ఎటువంటి అభివృద్ధి కి నోచుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ రంగనాయక స్వామి ఆలయం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నడుంబిగించాలని అన్నారు. గ్రామం లో మార్నింగ్ వాక్ లో బాగంగా పోచమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ పరిపాలనా భవనాలు లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల తో పాటు 30పడకల ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్, పబ్లిక్ టాయిలెట్ లను ఏర్పాటు చేయటానికి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి చొరవ చూపాలని కోరారు. రిజర్వాయర్ వెనకాల ఇండ్లు ప్రమాద స్థితికి చేరుకున్నాయి. వారికి ప్రభుత్వం నుంచి ప్రత్యామ్నాయం చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మేంద్ర సాగర్, వివి గౌడ్, అస్కని రమేష్, పాండురంగ యాదవ్, రాఘవేందర్, మహేందర్, శివ, రవి, రాజేష్, బీసన్న, సుమన్, ప్రవీణ్ గౌడ్ పాల్గొన్నారు.