28 June, 2026 | 3:01 PM

Breaking News

ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •  

ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు తీర్చాలి

23-04-2025 04:47 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో కూలీలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించాలని సిపిఐ కేసముద్రం మండల కార్యదర్శి గొడిశాల వెంకన్న బుధవారం ఎంపీడీవో క్రాంతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ... గత కొన్నేళ్ల నుండి చాలీచాలని వేతనాలతో కుటుంబ భారాన్ని మోస్తున్నారని, ప్రస్తుతం పెరిగిన నిత్యవసర ధరల నేపథ్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం నెలకు రూ. 26 వేల రూపాయలు చెల్లించాలని కోరారు. అలాగే పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని, 10 లక్షల బీమా సౌకర్యం సౌకర్యం కల్పించాలని కోరారు.