15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు తీర్చాలి

23-04-2025 04:47 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో కూలీలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించాలని సిపిఐ కేసముద్రం మండల కార్యదర్శి గొడిశాల వెంకన్న బుధవారం ఎంపీడీవో క్రాంతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ... గత కొన్నేళ్ల నుండి చాలీచాలని వేతనాలతో కుటుంబ భారాన్ని మోస్తున్నారని, ప్రస్తుతం పెరిగిన నిత్యవసర ధరల నేపథ్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం నెలకు రూ. 26 వేల రూపాయలు చెల్లించాలని కోరారు. అలాగే పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని, 10 లక్షల బీమా సౌకర్యం సౌకర్యం కల్పించాలని కోరారు.