01-02-2026 11:45:39 PM
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్
ముషీరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన కోసం ప్రతీ ఉద్యమకారుడు ఐక్యం కావాలని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొ ని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని, ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కారం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్, కోతి మాధవి, గుండా యాదగిరి, పాండు గౌడ్, ముత్తయ్య, గుండమల్ల శ్రీనివాస్, ఆంబూ రాథోడ్, జానకి రెడ్డి, శ్యామల, ప్రభాకర్, డోలక్ యాదగిరి, సాయిబాబా, ముప్పిడి నర్సన్న, అయోధ్య రామయ్య, రాజు గౌడ్, నాచం శంకర్ తో పాటు 11 సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.