02-02-2026 12:00:00 AM
జక్కిడి సమక్షంలో హస్తం గూటికి చేరిన పోచబోయిన వినోద్ యాదవ్
ఎల్బీనగర్, ఫిబ్రవరి 1 : మన్సూరాబాద్ డివిజన్ బీజేపీ నాయకుడు పోచబోయిన వినోద్ కుమార్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం మన్సూరాబాద్ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి సమక్షంలో వినోద్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇదిలా ఉండ గా మన్సూరాబాద్ డివిజన్లో బీజేపీ నాయకుడు పోచబోయిన వినోద్ యాదవ్ ఆయ న అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అనంతరం మన్సూరాబాద్ చౌరస్తా నుంచి కామినేని చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పోచబోయిన రవి యాదవ్, శంకర్ యాదవ్, వెంకు ల యాదవ్, కృష్ణ యాదవ్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంట శ్రావణ్, నాయకులు రఘుపతి, గిరి, రాజశేఖర్ రెడ్డి, జక్కిడి సత్య తేజారెడ్డి, అఖిల్ రెడ్డి, రాంబాబు రెడ్డి, తురుపాటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.