20 March, 2026 | 5:48 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

06-07-2024 12:00 AM

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్

బక్క జడ్సన్ దీక్షకు మద్దతు

నాలుగో రోజు కొనసాగిన ఆమరణ నిరాహార దీక్ష 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5(విజయక్రాంతి): నిరుద్యోగులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, గ్రూప్ 2, 3 పరీక్షను వాయి దా వేసి పోస్టుల సంఖ్యను పెంచాలని ఏపీవీసీసీ మాజీ చైర్మన్ బక్క జడ్సన్ నాలుగు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష కు శుక్రవారం మోత్కుపల్లి మద్దతు తెలిపా రు. జడ్సన్ ఇంటికి వెళ్లి వెళ్లి పరామర్శించి, మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ.. తెలంగాణ యువత పదేళ్లుగా ఉద్యోగాల కోసం పోరాడుతున్నదన్నా రు. గత ప్రభుత్వంలో వారికి జరిగిన అన్యాయాన్ని బస్సు యాత్ర ద్వారా ఊరూరు తిరి గి ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వ చ్చేలా చేశాననని చెప్పారు.  గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు 1:100 ప్రకారం ఎంపిక చేయాలని, గ్రూప్ 2, 3లో ఉద్యోగాలను పెంచాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు.