బీజేపీతోనే దేశ ప్రగతి

06-05-2024 02:18:56 AM

ఇబ్రహీంపట్నం, మే 5 (విజయక్రాంతి): బీజేపీతోనే దేశ ప్రగతి సాధ్య మని, ప్రజలు కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి అన్నా రు. ఆదివారం ఆయన పార్టీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌కు మద్దతుగా పార్టీ నాయకులతో కలిసి ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమగ్రత ప్రధాని మోదీతోనే సాధ్య మన్నారు. మోదీ ప్రవేశ పెట్టిన పథకాలు ప్రతి కుటుంబానికి ఆపత్కాలంలో భరోసానిచ్చాయన్నారు. కరోనా  సమయంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇచ్చారని గుర్తుచేశారు. అవినీతి లేని సంక్షేమ పాలన అందిస్తున్నారని కొనియాడారు. అనేక విప్లవా త్మక నిర్ణయాలు తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేశారన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో  ముందుకు తీసుకెళ్లారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో పార్టీ నాయకులు ముత్యాల భాస్కర్, పోరెడ్డి అర్జున్‌రెడ్డి, సత్యనారాయణ, అంజయ్య, నారాయణరెడ్డి, బోజిరెడ్డి, రాంరెడ్డి, రమణారెడ్డి, శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు.