ఢిల్లీ పోలీసులది అనైతిక చర్య
పీసీసీ లీగల్సెల్ చైర్మన్ రామచంద్రారెడ్డి
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని పీసీసీ లీగల్సెల్ చైర్మన్ రామచంద్రారెడ్డి విమర్శించారు. ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులు తీసుకుని.. విచారణకు సహకరిస్తామని చెప్పినా.. మహిళా పోలీసు లేకుండానే కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెందిన ఓ మహిళ నుంచి ఫోన్ స్వాధీనం చేసుకోవడమేంటని నిలదీశారు. ఆదివారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగే క్రైమ్ను పక్కన పెట్టి తెలంగాణపై ఎందుకు అంత శ్రద్ధ చూపుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు.
హైకోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ను కూడా పట్టించుకోకుండా మళ్లీ ఒక విద్యార్థిని అరెస్టు చేయాలని చూశారని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నామని, ఏది చెప్పినా చెల్లుతుందనుకోవడం సరికాదన్నారు. ఫేక్ వీడియోకు సంబంధించిన కేసుపై చట్టబద్ధంగా విచారణ చేయాలని పార్టీ నేత వినోద్రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు బెదిరింపులు మానుకోవాలని, తాము తలుచుకుంటే ఢిల్లీ పోలీసులను హైదరాబాద్కు రాకుండా చేస్తామని హెచ్చరించారు.




