26-06-2025 05:21:32 PM
మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి..
అప్పాజీపేటలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికై కృషి చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkat Reddy) అన్నారు. గురువారం మంత్రి నల్గొండ మండలం అప్పాజీపేట గ్రామంలో అప్పాజీపేట నుండి మిర్లోని గూడెం వరకు కోటి రూపాయల సిఆర్ఆర్ నిధులతో నిర్మించనున్న బిటి రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తమ ప్రభుత్వం చెప్పినదే కాకుండా చెప్పని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని అన్నారు. ముఖ్యంగా అన్ని గ్రామాలలో రహదారి సౌకర్యంతో పాటు, చెరువుల పటిష్టత వంటివి చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు.
రైతు సంక్షేమంలో భాగంగా రుణమాఫీ, రైతు భరోసా, రైతులకు మద్దతు ధర కల్పించడం, సన్నధాన్యానికి 500 రూపాయలు బోనస్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నమన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీలను అమలు చేశామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే ఎల్పిజి గ్యాస్ కనెక్షన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పరిమితి 10 లక్షల వరకు పెంచడం, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం వంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. గ్రామ చెరువు కట్ట పటిష్ఠతకు అంచనాలను రూపొందించి పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, పంచాయతీ రాజ్ ఈ ఈ గిరిధర్,డి ఈ రమేష్, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, అప్పాజీపేట మాజీ సర్పంచ్ గంగుల సైదులు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.