calender_icon.png 26 June, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక వర్గం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి

26-06-2025 05:29:26 PM

జులై 9న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి..

సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ..

చండూరు (విజయక్రాంతి): కార్మికులను కట్టు బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ ను రద్దు చేసేవరకు మోడీ ప్రభుత్వంపై కార్మికవర్గం సమరశీల పోరాటాలకు సిద్ధంకావాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ(CITU District President Chinapaka Laxminarayana) అన్నారు. గురువారం చండూరు మండల కేంద్రంలో జులై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు మునుగోడు జనరల్ బాడీ విస్తృతస్థాయి సమావేశం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు. వారి లాభాల కోసమే ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుపరం చేస్తుందన్నారు.

బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను 4 లేబర్ కోడ్స్ మార్పు చేయడం దుర్మార్గమన్నారు. ఈ కోడ్స్ అమలు జరిగితే కార్మికులు బానిసలుగా మారతారని అన్నారు. ఈ కోడ్స్ వల్ల కార్మికులు సమ్మె చేసే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, జీతభత్యాల కోసం భేరసారాల హక్కు కోల్పోతారన్నారు. పనిగంటలు విపరీతంగా పెరుగుతాయన్నారు. వెంటనే నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26 వేలు అమలు చేయాలని స్కీం వర్కర్లను పర్మినెంట్ చేయాలని గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ఆశ వివోఏ మధ్యాహ్న భోజనం అంగన్వాడి వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని అసంఘటితరంగా కార్మికులకు కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు ఆపకపోతే జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మె మోడీ ప్రభుత్వానికి ఒక గుణపాఠం అవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, సిఐటియు మునుగోడు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు, సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనుంజయ, సిఐటియు సీనియర్ నాయకులు మొగుదాల వెంకటేశం, చిట్టి మల్ల లింగయ్య, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు కోరే లలిత, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కత్తుల సైదులు, నల్లగంటి లింగస్వామి, బి. కలమ్మ, బిపంగి నాగరాజు, ఇరిగి యాదగిరి, గండూరి వెంకన్న, సల్వోదు రామలింగా చారి, నీలకం రాములు, ఈరటి వెంకటయ్య, నక్క నరసింహ, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.