calender_icon.png 25 December, 2025 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలి : డీప్యూటీ సీఎం భట్టి

25-12-2025 12:00:00 AM

ఉప ముఖ్యమంత్రిని కలిసిన రెవెన్యూ ఉద్యోగుల నూతన కార్యవర్గం

ఖమ్మం టౌన్, డిసెంబర్ 25 (విజయ క్రాంతి) : రెవెన్యూ సేవల్లో నాణ్యతను మరింత మెరుగుపరచాలని, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రెవెన్యూ ఉద్యోగులకు సూచించారు. ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా యూనిట్తో పాటు ఖమ్మం, కల్లూరు డివిజన్లు, కలెక్టరేట్ యూనిట్ల నూతన పాలకవర్గ సభ్యులు బుధవారం ఉప ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.

నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కారుమంచి శ్రీనివాసరావు, రాష్ట్ర కోశాధికారి బి.వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు తుంబూరు సునీల్ రెడ్డి, కార్యదర్శి కె.వి.వి. ప్రసాద్, కోశాధికారి క్రాంతి కుమార్, గౌరవ అధ్యక్షులు రవీందర్, ముజాహిద్, సాయి నరేష్, ఖమ్మం డివిజన్ అధ్యక్షులు సీహెచ్. సురేష్, కార్యదర్శి ఎం. శ్రీనివాస్, కల్లూరు డివిజన్ అధ్యక్షులు టి. కరుణాకర్ రెడ్డి, కార్యదర్శి డి. కరుణశ్రీ, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షులు పి. రాజేష్, కార్యదర్శి బి. రవి తదితర రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.