18 August, 2026 | 3:02 AM

కదిలి ఆలయంలో భక్తుల క్యూ

18-08-2026 12:00 AM

నిర్మల్, ఆగస్టు 17 ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ మండలం కదిలి అన్నపూర్ణ పాపేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ సోమవారం పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుండి ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక మొక్కలు చెల్లించుకున్నారు. రాగి చెట్టుకు ప్రదర్శనలు చేసి మొక్కులు కట్టారు. అభిషేక పూజ మహారథి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ వెంకట్రావు వేద పండితులు పంచాక్షరి శంకర్ సిద్దు తదితరులు ఉన్నారు.