calender_icon.png 26 January, 2026 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటు హక్కు వజ్రాయుధం

26-01-2026 12:33:49 AM

కలెక్టర్ రాహుల్ రాజ్ 

మెదక్, జనవరి 25 (విజయ క్రాంతి) :ప్ర జాస్వామ్య ములో ఓటు హక్కు వజ్రాయుధమని , 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్ర తి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకొని త మ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలోని మున్సిపా లిటీ కార్యాలయం నుండి బాలుర జూనియర్ పాఠశాల మరియు కళాశాల మైదా నం వరకు 16 వ జాతీయ ఓటర్ దినోత్సవా న్ని పురష్కరించుకొని ర్యాలీ నిర్వహించారు.

కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు పాల్గొన్నారు జాతీయ ఓటరు దినోత్సవం సంద ర్బంగా జిల్లా అధికారులు, ఓటర్ల అందరిచే ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురి కా కుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. అ నంతరం 16 వ జాతీయ ఓటరు దినోత్సవ ము సందర్బంగా కళాశాల మైదానం గ్రౌం డ్లో. నందు ఏర్పాటు చేసిన సమావేశములో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓ టు హక్కు ఎంతో విలువైనదని అందరు ఓ టు హక్కు ప్రాధాన్యతను గుర్తించాలని, ప్రతి ఒక్కరు ఓటు హక్కుపై అవగాహనా కలిపించికోవాలని సూచించారు.

పద్దెనిమిది సంవ త్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా న మోదు కావడంతో పాటు, ఎన్నికల్లో విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 18 సంవత్సరాలు పూ ర్తి అయిన ఎనిమిది మందికి ఓటు హక్కు కలిపిస్తూ బ్యాడ్జీలు పంపిణి చేశారు. ప్రజాస్వామ్యములో 85 సంవత్సరాల నుండి ఓ టు హక్కు వినియోగించుకున్న03 మంది సీ నియర్ సిటిజన్స్ కు ఈ సందర్బంగా శాలువాలతో సన్మానం చేశారు. ఓటరు అవగాహనా కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొని అత్యుత్తమ ప్రతిమ కనబరిచిన వా రికి సర్టిఫికేట్ లు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, మెదక్ ఆర్ డి ఓ రమాదే వి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి,జిల్లా విద్యాశాఖ అధికారి విజయ, వ్యవసాయ అధికారి దేవకుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివా స్ రెడ్డి,ఇంటర్మీడియట్ అధికారి మాధవి , ,తాసిల్దార్ లక్ష్మణ్ బాబు , ఎన్నికల తాసిల్దా ర్ గఫార్, డీఎస్పీ ప్రసన్నకుమార్, అధికారులు,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.