15-11-2025 12:47:14 AM
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
కోరుట్ల నవంబర్ 15 (విజయక్రాంతి): ఆధునిక యుగంలో నేరాల నియంత్రణ, కే సుల పరిష్కారంలో, ప్రజా భద్రత పరిరక్షణలో సీసీ కెమెరాల వినియోగం అత్యంత కీలకమని , ప్రతి పట్టణం, ప్రతి గ్రామం సీసీ కెమెరాలతో నిండినప్పుడు పోలీసింగ్ మరిం త సమర్థవంతంగా మారుతుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా కోరుట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన 123 నూతన సీసీ కెమెరాలను శుక్రవారం ఎస్పీ అశోక్ కుమార్ ప్రా రంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూప్రజల రక్షణకు, నేరా ల అరికట్టడానికి సీసీ కెమెరాలు అమూల్యమైన సాధనాలు గా ఉపయోగపడుతున్నా యని అని. ప్రతి వీధి, చౌరస్తాల వద్ద కెమెరాలు అమర్చడం వలన నేరం జరిగిన వెం టనే గుర్తించి, నిందితులను పట్టుకోవడం చాలా సులువుగా జరుగుతోంది అని, సీసీ కెమెరాలు లేకపోయి ఉంటే కేసులు ఛేదించడం లో జాప్యం జరిగేది, కానీ ఇప్పుడు వా టి సహాయంతో విచారణ చాలా వేగంగా జరుగుతోంది అని అన్నారు.
ఇప్పటికే జిల్లా లో జగిత్యాల ,మెట్ పల్లి, ధర్మపురి,ఈరోజు కోరుట్ల లో పెద్ద మొత్తంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని సీసీ కెమెరాల ఏర్పాటు వలన దొంగతనాలు, చోరీ లు, గొడవలు, రోడ్డు ప్రమాదాలు వంటి ఘ టనల్లో నిందితుల కదలికలు రికార్డ్ అయి పోలీసులు వెంటనే గుర్తించి నిందితులను పట్టుకోవడంలో సులువుగా మారిందని అనేక ఉదాహరణలు ఉన్నాయని అన్నారు.
కెమెరాలు పోలీసులకు మూడో నేత్రం అని ఏ సమయంలోనైనా, ఏ చోటైనా నేరాలు జరగకుండా ముందుగానే హెచ్చరికగా పనిచేస్తాయి అని, ఇవి కెమెరాలు ఉన్నాయన్న భయం నేరస్థుల్లో ఉంది అని పేర్కొన్నా రు.ప్రజలు తమ ఇళ్లకు, వ్యాపార సంస్థలకు, అపార్ట్మెంట్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే వ్యక్తిగత భద్రతతో పాటు సమాజ భద్రత కూడా బలోపేతం అవుతుందని సూ చించారు.
ప్రత్యేకంగా ప్రధాన రహదారులు, క్రాస్ రోడ్లు, వ్యాపార రద్దీ సెంటర్లు, మార్కె ట్ ఏరియాల్లో కెమెరాల ఏర్పాటు తప్పని సరి అవసరం అని ,కొత్తగా కోరుట్ల లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన స్థానిక డాక్టర్లు ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, ఇతర సంస్థల ప్రతినిధులను అభినందించారు. ఈ వ్యవస్థ ప్రజల సహకారం లేకుండా చేయడం చాలా కష్టం అని, మీరు చూపిన చొరవ అభినందనీయం. ఇదే స్ఫూర్తితో కోరుట్ల పరిసర ప్రాం తాల ప్రజలు కూడా ముందుకు రావాలి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మెట్ పల్లి డిఎస్పీ రాములు,కోరుట్ల సీ.ఐ సురేష్ బాబు, ఎస్.ఐ లు చిరంజీవి, రామచంద్రం, స్థానిక డాక్టర్లు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు,పాల్గొన్నారు.