18 April, 2026 | 3:56 PM

Breaking News

మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి   •   ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌... DA పెంపు   •   హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్‌ — ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్— ఇరాన్ సంచలన ప్రకటన   •   రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం   •   మహిళా బిల్లు వీగిపోవడం— బీజేపీ విధానాల ఓటమి   •   దేశ మహిళలకు అన్యాయం.. కాంగ్రెస్, బీజేపీ‎ల‎పై హరీశ్‎రావు కీలక వ్యాఖ్యలు   •   వర్క్ షాప్ కోసం అనుమతి ఇవ్వండి   •   కరీంనగర్ లో విజయక్రాంతి వార్షికోత్సవ వేడుకలు   •   రాఘవపేటలో బడిబాట కార్యక్రమం   •   దళిత క్రిస్టియన్స్ పై సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి   •  

భాషోపాధ్యాయుల పాత్ర కీలకమైనది

04-04-2025 12:00 AM

జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ 

మహబూబ్ నగర్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): మాతృభాష అమ్మ లాంటిదని ఇతర భాషలు నేర్చుకోవాలంటే మాతృభాషలో పట్టు ఉన్నప్పుడే సాధ్యమవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు గురువారం జిల్లా కేంద్రంలోని విద్యా శిక్షణ సంస్థలో పదోన్నతి పొందిన తెలుగు భాషోపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో డీఈవో మాట్లాడారు.

పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు తమ నైపుణ్యాలని పెంచుకొని పాఠ్యాంశాలను బోధించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ పాఠ్యాంశాలను బోధిస్తున్నారని మరో అడుగు ముందుకేసి ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన చేసేందుకు శ్రీకారం చుట్టిందన్నారు.

రాబోయే రోజులన్నీ ఏఐ  ప్రభావం చూపి అవకాశం ఉందని పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమం ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగపడుతుందని డీఈఓ అన్నారు.   

ఈ కార్యక్రమంలో ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, డైట్ కళాశాల ప్రిన్సిపల్ మీరాజుల్లా ఖాన్  జిల్లా రిసోర్స్ పర్సన్ లు గుమ్ముడాల చక్రవర్తి గౌడ్ గిరిజారమణ మల్లేశ్వర్ జి వెంకటేశ్వర్లు కమలేకర్ శ్యాం ప్రసాద్ ఇరివింటి వెంకటేశ్వర శర్మ అంబటి భానుప్రకాష్ బలరాంగౌడ్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.