calender_icon.png 9 June, 2025 | 12:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయాలి

08-06-2025 08:37:51 PM

బిజెపి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్..

మందమర్రి (విజయక్రాంతి): త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో కాషాయ జెండాను ఎగురవేయాలని జిల్లా బిజెపి అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్(District BJP President Nagunuri Venkateshwar Goud) కోరారు. మండలంలోని చిర్రకుంట గ్రామంలో ఆదివారం నిర్వహించిన మండల బీజేపీ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేద ప్రజల సంక్షేమానికి నిర్విరామంగా కృషి చేస్తుందన్నారు.

జాతీయ రహదారుల అభివృద్ధి, గ్రామీణ గ్రామీణ అభివృద్ధి, నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ దేశాన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్తున్నాడని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ బిజెపి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బిజెపి అని బిజెపి ని బలోపేతం చేసి రానున్న స్థానిక ఎన్నికలలో అన్ని గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అనంతరం నరేంద్ర మోడీ 11 సంవత్సరాల సుపరిపాలనను, స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను కార్యకర్తలకు వివరించారు. అంతకుముందు గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించి మొక్కలు నాటారు. మండల బిజెపి అధ్యక్షులు గిర్నాటి జనార్ధన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, సీనియర్ నాయకులు దేవరనేని సంజీవరావు, దీక్షితులు, మండల ప్రధాన కార్యదర్శులు వంజరి వెంకటేష్ రాజేష్ నాయక్, కర్రె రాజయ్య, ఎనగందుల రాజయ్య, దుర్గం మల్లేష్, చిరంజీవి, దేవేందర్, రాము, మెండే పోచయ్య, ప్రదీప్ కుమార్, అశోక్, ఉప్పుల రాజు, సలేంద్ర శ్రీనివాస్, దిలీప్, దశరథం, రాకేష్, ప్రశాంత్, మారుతి, వివిధ గ్రామాల బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.