23-01-2026 12:00:00 AM
ఎస్పీ కేకన్ సుధీర్ రామనాధ్
మేడారం, జనవరి 22 (విజయక్రాంతి): మేడారం జాతరలో సేవలందిస్తున్న హోంగార్డు నుండి ఎస్పీ వరకు అందరికీ ఒకే రకమైన ఆహారం అందించాలని, ఆహారం నాణ్యతలో తేడా వస్తే చర్యలు తీసుకుంటామని ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ మేడారం క్యాటరింగ్ నిర్వాహకులను హెచ్చరించారు. మేడారం జాతర బందోబస్తు విధుల్లో ఉన్న సిబ్బందికి అందిస్తున్న భోజన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.
మెస్లో భోజన నాణ్యతను పరిశీలించి, అన్ని ర్యాంకుల అధికారులు, సిబ్బందితో పాటు పారిశుధ్య కార్మికులకు కూడా సమానమైన, నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని ఆదేశించారు. భోజనం పరిశుభ్రత ప్రమాణాలకు అనుగు ణంగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా సంబంధిత నిర్వాహకులు, పర్యవేక్షణ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటానని ఎస్పీ స్పష్టం చేశారు.
ఎస్పీ స్థాయి అధికారి స్వయంగా తీ సుకునే ఆహారమే బందోబస్తు విధుల్లో ఉన్న ప్రతి సిబ్బందికి అందించాలని ఆహార విభాగం ఇన్చార్జ్ అధికారులను ఆదేశించారు. బందోబస్తు విధుల్లో ఉన్న సిబ్బంది ఆరోగ్యం, భద్రత అత్యంత ముఖ్యమని పేర్కొంటూ, ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి శివమ్ ఉపాధ్యాయ, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ బట్, సీఐలు శంకర్, శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.