23-06-2025 09:00:21 PM
కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి..
అనంతగిరి: అనేక రంగాలలో బివిఆర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి(MLA Uttam Padmavathi Reddy) అన్నారు. సోమవారం అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్ నాయకులు బుర్ర ప్రమోద్ రెడ్డి జన్మదిన సందర్భంగా బివిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చేతుల మీదుగా పాఠశాల విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం విద్యా, వైద్య, వ్యవసాయ, సామాజిక రంగాలకు తొలి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. బివిఆర్ ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు.
అంతకుముందు డ్రగ్స్ కు వ్యతిరేక వారోత్సవాలలో భాగంగా జడ్పీహెచ్ఎస్ శాంతినగర్ పాఠశాలలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, ఎంఈఓ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు, గునుకుల గోపాల్ రెడ్డి, బుర్ర పుల్లారెడ్డి, కొండపల్లి వాసు, డేగ కొండయ్య, బాబు నాయక్, బుర్ర నర్సింహారెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, వెంపటి వెంకటేశ్వరరావు, రాఘవరెడ్డి, బద్దం భద్రా రెడ్డి, నాగుల్ మీరా, దస్తగిరి, బివిఆర్ ఫౌండేషన్ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.