23-06-2025 08:55:56 PM
అనంతగిరి: సోమవారం అనంతగిరి మండల(Ananthagiri Mandal) పరిధిలోని శాంతినగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో 2 లక్షల 70 వేలు గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన 18 సీసీ కెమెరాల పోలీస్ కంట్రోల్ రూమ్ ను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను గుర్తించి త్వరితగతిన ఏర్పాటు చేస్తున్నందుకు గ్రామస్తులను, పోలీస్ శాఖను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి, ఎస్ఐ నవీన్ కుమార్, మండల అధ్యక్షులు ముస్కు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ బద్ధం కృష్ణారెడ్డి, గునుకుల గోపాల్ రెడ్డి, వెంపటి వెంకటేశ్వరరావు, అఫ్జల్, తదితరులు పాల్గొన్నారు.