10 May, 2026 | 9:07 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ప్రవాస భారతీయుల సేవలు గర్వకారణం

18-08-2025 01:18 AM

హీరో విజయ్ దేవరకొండ అమెరికాలో 43వ ‘ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పెరేడ్’లో సందడి చేశారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు న్యూయార్క్‌లోని అక్కడి మాడిసన్ అవెన్యూ వేదికయ్యింది. ‘సర్వే భవంతు సుఖినః’ అనే థీమ్‌తో ఏర్పాటుచేసిన ఈ వేడుకలకు విజయ్ దేవరకొండ గ్రాండ్ మార్షల్‌గా వ్యవహరించారు. ఈ వేడుకలో స్థానిక అమెరికన్లతోపాటు భారీ సంఖ్యలో ప్రవాస భారతీయులు కూడా పాల్గొన్నారు.

ఈ వేడుక సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన ప్రఖ్యాత ఎంపైర్ బిల్డింగ్ మన జాతీయ జెండాలోని మూడు రంగుల విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది. ఈ మువ్వన్నెల లైటింగ్‌ను మన రౌడీ హీరో స్విచ్ఛాన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రవాస భారతీయ సోదరులు మనదేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటుతున్నారు.

ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై మన మూడు రంగులు చూడటం సంతోషాన్ని కలిగిస్తోంది. దేశం కోసం వీళ్లు చేస్తున్న సేవ చూస్తుంటే గర్వంగా ఉంది. మన పెద్దలు ఎంతోమంది చేసిన త్యాగాలు, వారి కృషి వల్లే మనం ఇంత ఆనందంగా స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం” అన్నారు.