ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి
16-07-2026 12:00 AM
ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయ ణ తెలిపారు. నగరంలోని 28వ డివిజన్లో ఎస్ఐఆర్ ప్రక్రియను బుధవారం ఆయన పరిశీలించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హ క్కు కలిగి ఉండడం ప్రతి ఒక్కరి బాధ్యత అ న్నారు. కావున ఎన్నికల సంఘం నిర్వహిస్తు న్న ఎస్ఐఆర్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రధానంగా ఎన్యుమరేషన్ పత్రాలను పూర్తిచేసి సంబంధిత బిఎ ల్ఓ లకు అందజేయాలన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియ గడుపును ఈ నెల 24 నుంచి ఆగస్టు 3వ తేదీకి పొడిగించిందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మల్కాయి మ హేందర్, నాగోల్ల లక్ష్మీనారాయణ, జ్యోతి మురళి, నాయకులు కిరణ్ పాల్గొన్నారు.






