26-01-2026 01:36:15 AM
ఉట్నూర్, జనవరి 25 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో వెలసిన మెస్రం వంశీయుల ఆరాధ్య దైవమైన శ్రీ నాగోబా దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య దర్శించుకున్నారు. నాగోబా జాతర సందర్భంగా ఆదివారం కమీషన్ సభ్యులతో కలిసి నాగోబా కు చైర్మన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సత్కరించి నాగదేవత చిత్రాన్ని అందించారు. ఈ మేరకు రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. నాగోబా జాతర అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిందన్నారు. నాగోబా దేవుని ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని కోరుకున్నట్టు తెలియజేసారు. కార్యక్రమంలో ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్రం నీలాదేవి, రేణికుంట్ల ప్రవీణ్, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, శంకర్ తదితరులు ఉన్నారు.