06-05-2025 12:58:45 AM
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): ‘రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది. వచ్చే ఆదాయంలో సగం అప్పులు, మిత్తీల చెల్లింపులకే పోతుంది’ అని సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘తెలంగాణ దివాళా తీయలేదు సీఎం గారూ.. మేధోపరం గా దివాళా తీసింది మీరు.. మీ కాం గ్రెస్ పార్టీ.
ఫలితంగా నైతికంగా నష్టపోయిందీ మీరే..’ అంటూ ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ఈ మేరకు మంగళవారం మీడియా సమావేశం నిర్వ హించి, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతానని స్పష్టం చేశారు.