15 March, 2026 | 5:42 PM

Breaking News

మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •   భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు   •   పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం   •   డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి పాజిటివ్   •  

రాష్ట్రంలో దోచుకో, దాచుకో పాలన

19-01-2026 12:57 AM

మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): గత వారం, పది రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో, మీడియా రంగంలో విచిత్రమైన పరిస్థితులు చూస్తున్నామని, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో దోచుకో, దాచుకో అన్నట్టు ఉందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. దోచుకునే దాంట్లో సీఎం, మంత్రుల మధ్య పంచాయితీలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశా రు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడి యా సమావేశంలో ఆయన మా ట్లాడారు.

ఈ గొడవ మంత్రి జూపల్లి కృష్ణారావుతో మొదలైందని, మంత్రి కొండా సురేఖ కూతురు స్వయంగా సీఎం, రెవెన్యూ మంత్రిపైనే ఆరోపణలు చేసిందన్నారు. హిల్ట్ పాలసీ ఒక మంత్రి, సినిమా టిక్కెట్ల గురించి మరో మంత్రి తెలియదని చెప్పడంతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ బాగోతం గురించి 6 నెలలుగా చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ బాగోతం ఖమ్మం సభలో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. రేవంత్‌రెడ్డిని ఒక పత్రిక అధిపతి కాపాడలేరని, ప్రజలే బుద్ధి చెప్తారన్నారు.