calender_icon.png 10 November, 2025 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుఫాన్ నివేదిక పక్కాగా ఉండాలి

10-11-2025 01:21:17 AM

మంత్రి పొన్నం ఆదేశం

కరీంనగర్, నవంబర్9(విజయక్రాంతి):మొంథా తుఫాన్ నష్టం అంచనాల వ్యవసాయ అధికారులు, క్షేత్ర స్థాయిలో రైతుల పొలాలను సందర్శించి పక్కాగా నివేదిక తయారు చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.ఏ ఒక్క నష్టపోయిన రైతు మిగలకుండా ప్రతి ఒక్కరిని కవర్ చేయాలని అన్నారు.నిర్నిత నమూనా లో తుఫాన్ న ష్టం అంచనా నివేదిక లు సమర్పించాలని అధికారులను ఆదేశించారు .

పంచాయతీ రాజ్, ఆర్‌అండ్ బిరో డ్లు ఎంత మేరకు మరమ్మత్తులకు గురైందనే అంశాలను క్షేత్ర స్థాయి పరిశీలన చేసి పూర్తి ఆధారాలతో నివేదిక సిద్దం చేయాలని, తాత్కాలిక మరమ్మత్తులు, శాశ్వత మరమ్మత్తులకు ఎంత వ్య యం అవుతుందో అంచనాలతో సహా వివరాలు సమర్పించాలని తెలిపారు.విద్యుత్ శాఖ సంబంధించి దెబ్బతిన్న పోల్స్, ట్రాన్స్ ఫార్మర్ వివరాలు అందించాలని అన్నారు. నీటి పారుదల శాఖ పరిధిలో దెబ్బతిన్న చెరువులు, కాల్వలు, నీటివనరుల వివరాలు సమర్పించాలన్నారు. ఇతర నిర్మాణాలు, దెబ్బతిన్న ఇండ్ల సంఖ్య, చనిపోయిన పశువులు, గొర్రెలు, పౌల్ట్రీ తదితర వివరాల ను పక్కాగా తయారుచేసి నష్టపోయిన వారికి సహాయం చేరేలా చూడాలని మంత్రిఆదేశించారు.