03-12-2024 12:00:00 AM
శ్రీకాంతాచారి వర్ధంతి నేడు
మలిదశ ఉద్యమానికి ఊపిరిగా తన ప్రాణాన్నే ప్ర సాదించిన అమరు డు శ్రీకాంతాచారి. ఈ దశలో అమరుడైన తొలి విద్యార్థి నాయకుడు. ఆయ న ఆత్మ బలిదానం విద్యార్థి లోకాన్నీ, నాలుగు కోట్ల తె లంగాణ ప్రజల గుండెల్ని రగల్చి ఉద్యమం వైపు ఉరుకులు పెట్టించింది.1986 ఆగస్టు 15న ఉమ్మడి నల్గొండ జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన కాసోజు వెంకటాచారి, శంకరమ్మ దంప తుల పెద్ద కుమారుడు శ్రీకాంతాచారి.
అత్యంత సాధారణ కుటుంబ నేపథ్యం వారిది. ఎప్పుడూ సమాజసేవలో ముందుండేవాడు. తాను దాచుకున్న డబ్బుతోనే విద్యాభ్యాసం చేశాడు. ఎప్పుడూ ఆడుతూ, పాడుతూ చలాకీగా ఉండేవాడు. ఉన్నత చదువులకోసం ఉస్మానియా యూనివ ర్సిటీలో చేరాడు. తొలుత బీజేపీ, తర్వాత టీఆరెస్లో విద్యార్థి నాయకుడిగా, ఉద్యమ కార్యక్రమాలలో ముందుండి నడిచాడు. ఇంటికి వెళ్లినా, బయట ఎవరు కలిసినా తెలంగాణ ధ్యాసే. అవే పాటలు పాడుతూ తెలంగాణ ఉద్యమ కవితలు రాస్తూ నినాదాలు చేస్తూ గడిపేవాడు. అతని ఆరో ప్రాణంగా, నిరంతర ఆలోచనగా, ఊత పదంగా తెలంగాణ అయింది.
2009 నవంబర్ 22న హైదరాబాద్ ఎల్బీనగర్లో కేసీఆర్ అరెస్టుకు నిరసనగా తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొన్నాడు. ‘జై తెలంగాణ’, ‘జైజై తెలంగాణ’ అంటూ కాలిన గాయాలతోనే అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ కోసం వేడుకున్నాడు. కామినేని, యశోద, ఉస్మానియా, అపోలో ఆసుప త్రులలో చికిత్స పొందినప్పటికీ, గాయాలు బాధిస్తున్నా తెలంగాణ కోసమే కలవరిల్లి, చివరి దశలోనూ తెలంగాణ, తెలంగాణ అంటూ 2009 డిసెంబర్ 3న ప్రాణాలు విడిచాడు.
శ్రీకాంతాచారి తల్లికి బీఆర్ఎస్ పార్టీలో సరైన న్యాయం జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వమైనా ఆమెను సముచితంగా గౌరవించాలి. రాజకీయాలకు అతీతంగా ఆయన వర్ధంతిని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలి. తన త్యాగ చరితను తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలి. భవిష్యత్ తరాలకు ఉద్యమస్ఫూర్తి నింపాలి.
వైద్య ఉమాశేషారావు