05-06-2025 05:15:42 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ రూరల్ ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఉల్లిరాముల సూరయ్యకు ఎస్ఐగా పదోన్నతి లభించింది. కేసముద్రం మండలం అమీనాపురం గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన సూరయ్య పట్టుదలతో చదివి పోలీస్ కానిస్టేబుల్ గా 1989లో ఉద్యోగంలో చేరాడు. 2012లో హెడ్ కానిస్టేబుల్ గా, 2018లో ఏఎస్ఐగా పదోన్నతి పొంది, విశిష్ట సేవలు అందించడంతో అప్పటి ఎస్పీ కోటిరెడ్డి చేతుల మీదుగా మెడల్ కూడా అందుకున్నారు. ప్రస్తుతం మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న సూరయ్య ఎస్ ఐ గా పదోన్నతి పొందగా, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ సూరయ్యకు పదోన్నతికి సంబంధించి గుర్తింపుగా ఇచ్చే స్టార్ బహుకరించి అభినందించారు.