21-06-2025 11:40:27 PM
మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రస్తుత కాలంలో సీసీ కెమెరాల వినియోగం తప్పనిసరిగా మారిందని మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు(Former MLA Atram Sakku) అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీసీ కెమెరా 100 మందితో సమానమని తెలిపారు. నేరాల నియంత్రణలో పోలీస్ శాఖకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతున్నాయని తెలిపారు. ప్రతి ఇంటికి, వ్యాపార సంస్థలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో నేరాలు జరిగినప్పుడు దాన్ని ఛేదించడం సులభం అవుతుందని తెలిపారు.సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడంతో భద్రత ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇర్ఫాన్ బిన్ సులేమాన్, ఉబేద్ బిన్ యాహియా తదితరులు పాల్గొన్నారు.